Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
ఆదివారం స్థానిక శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో జరిగిన నేలకొండపల్లి టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్ష ఎన్నిక సమావేశం రసాభాసగా జరిగింది. అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. అరుపులు, నినాదాల మధ్య ఆఖరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా తెరపై రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి నేలకొండపల్లికి చెందిన శీలం దుర్గాప్రసాద్, మైసా శంకర్, కోనేరు కిషోర్, వంగవీటి నాగేశ్వరరావు పోటీ పడ్డారు. కాగా వీరిలో గ్రామ మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు పేరును మెజారిటీ కార్యకర్తలు వ్యతిరేకించడంతో చేసేది లేక ఆయన అక్కడ్నుంచి నిష్క్రమించారు. పార్టీ సీనియర్ నాయకుడు కిషోర్ పోటీ నుంచి తప్పుకుంటున్నానని, దుర్గా ప్రసాద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. దీంతో దుర్గాప్రసాద్, మైసా శంకర్కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శంకర్ పట్టణ అధ్యక్షుడిగా గతంలో పని చేసినందున ఈ దఫా దుర్గాప్రసాద్కు అవకా శమి వ్వాలని మెజార్టీ సభ్యులు నాయకులు కోరడంతో దుర్గా ప్రసాద్ నేలకొండపల్లి పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీలోని గ్రూపుల మధ్య నెలకొన్న వైరుద్యం మరోసారి బహిర్గతమైంది.