Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
గిరిజన హక్కులు, తండాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఖమ్మంలో డిసెంబర్లో జరుగుతాయని, ఆ రాష్ట్ర మహాసభలను జయప్రదానికి సహకరించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. ఆదివారం మండల పరిధిలో తెల్దారుపల్లి తండాలో గిరిజన సంఘం గ్రామ మహాసభ మాజీ సర్పంచ్ బోడా బిక్షం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గాలు గిరిజనులను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని అభివృద్ధిని విస్మరిస్తున్నా యన్నారు. గిరిజనులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో 10శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని, అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కమిటీ 20 మందితో ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా భూక్యా రాములు నాయక్, ప్రధాన కార్యదర్శులుగా మాళోతు లాలు, కార్యదర్శి భూక్యా రవితో పాటు భూక్యా వెంకన్న, మల్సూరు, పి.శ్రీనివాసరావు, గుగులోతు శివ, బానోతు శర్మ, బోడ బిక్షం, గోపి, బాబు, రమేష్, ఉపేందర్, వీరన్న, సత్యం తదితరులున్నారు.