Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
జోనల్ స్ధాయి స్కూల్ గేమ్స్లో కారేపల్లి మండలం మాధారం జేడీఏవీ (జవహర్ దయాళ్ ఆంగ్లో వేదిక్) విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనారు. ఉసిరికాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో అండర్-14 విభాగం 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్ పోటీల్లో జేడీఏవీ విద్యార్థి బి.గిరిప్రసాద్ ప్రధమ బహుమతులు గెలుచుకోని జిల్లా స్ధాయికి ఎంపికైనాడు. కబడ్డీ అంశంలో బి.నాగరాజు, బి.ఆనంద్లు ప్రతిభ చూపి జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను హెచ్ఎం ఫణికుమార్ అభినందించి మాట్లాడుతూ జేడీఏవీ విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో ఉన్నత స్థానంలో నిలుస్తున్నారన్నారు.
కూసుమంచి : గత రెండ్రోజులుగా మండల కేద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పాఠశాలల స్థాయి జోనల్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన అండర్-14, 17 విద్యార్థినీ విద్యార్థులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ గేమ్స్ కన్వీనర్, సెక్రటరీ కే.నర్సిం హమూర్తి, కూసుమంచి సర్పంచ్, ఎంపీటీసీ చెన్నా మోహన్, మాదాసు ఉపేందర్, ఎస్ఎంసీ చైర్మన్ హకీమ్పాషా, పీఈటీలు పాల్గొన్నారు.