Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జామాయిల్, సుబాబుల్ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21,22న నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్నంలో జరుగనున్న ఏఐకెఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. పేపర్ బోర్డ్ యాజమాన్యాలు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ, ఎక్కువ లాభాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలు పొందుతున్నారని విమర్శించారు. రైతులు సబ్సిడీ లోన్, బ్యాంకు రుణాలు అందక తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులతో చర్చలు జరిపి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.