Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు
నవతెలంగాణ-మధిర
రాష్ట్రంలో చాలీచాలని కూలీతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించి తక్షణమే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీని వాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర పట్టణంలోని స్ధానిక బోడేపూడి భవనంలో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ.. కూలీలకు ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కూలి బంధు పథ కాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా నాయకులు మండవ కృష్ణారావు, మందా సైదులు, నాయుడు శ్రీరా ములు, విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక : నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా ఊట్ల శంకర్రావు, అధ్యక్షులుగా షేక్.ఉద్దండు సాహెబ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 16మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు.