Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
పట్టుదలతో చదివి, మెడికల్ సీటు సాధించింది సత్తుపల్లికి చెందిన అనుమోతు తేజశ్విని. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 140వ ర్యాంకు సాధించిన తేజశ్విని హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాలలో ప్రతి భ ఆధారంగా ప్రవేశం పొందింది. గతేడాది నీట్ పరీక్ష రాసిన ఈమెకు 1400 ర్యాంకు రాగా అప్పట్లో మెడికల్ సీటు రాలేదు. డెంటల్ కళాశాల లో సీటు వచ్చిన తేజశ్విని మొదటి సంవత్సరం చదువుతూనే తన లక్ష్యమైన మెడికల్ సీటు కోసం డెంటల్ విద్యను వదిలేసి మెడికల్ సీటు పొందేందుకు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధిం చింది. ఆదివారం సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని రాజీవ్నగర్లోని సా యిబాబా ఆలయం ప్రాంగణంలో తేజశ్వినిని బంధు మిత్రులు అభినం దన సభ ఏర్పాటు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కొప్పుల ప్రసాదరెడ్డి, మంద పాటి సత్యనారాయణరెడ్డి, పత్తి ప్రసాద్ అభినందించారు.