Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు ఎర్రుపాలెం మండల విద్యార్థి
నవతెలంగాణ-ఎర్రుపాలెంరూరల్
క్రీడలు తమ ప్రతిభను వెలికి తీస్తూ ఉన్నత శిఖరాలకు ఎగిసేలాగా చేస్తా యని పాఠశాల హెచ్ఎం ఆమంచి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సిరివెన్నెల నవ్యశ్రీ విద్యార్థిని రాష్ట్రస్ధాయి త్రోబాల్ క్రీడాపోటీలకు జిల్లా జట్టు తరుపున ఎంపికయ్యా రని ఆదివారం విలేకరులకు తెలిపారు. జిల్లా స్కూల్ గ్రేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మంచిర్యాలలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో ఈ విద్యార్థి పాల్టొంటారని తెలి పారు. సర్పంచ్లు వేమిరెడ్డి సుధా కర్రెడ్డి, మారాబత్తుల మోహన్ రావు, ఎంపీటీసీ తల్లపురెడ్డి ప్రవళ్లిక, గంగారపు రాధిక క్రీడాకారిని అభినందించారు. వీరితో పాటు పాఠశాల స్కూల్ గేమ్స్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు జగదీష్, సతీష్, వ్యాయామ పాఠశాల ఉపాధ్యాయులు జమలయ్య, నాయకులు కోటిబాబు, నాగేశ్వరరావు, జ్యోతి మణి, రామకృష్ణ రాజు, గ్రామస్తులు, విద్యార్ధులు అభినందనలు తెలిపారు.