Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
రోజురోజుకు జ్వర పీడితులు మృతి చెందుతు న్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జ్వరాలు విపరీతంగా విజృంభించాయి. కల్లూరు లో మొదట సోమలింగారెడ్డి వీధి, రాధాకృష్ణమూర్తి వీధి, పుల్లయ్య బంజర వీధి, కప్పల బంధం వీధి ఇలా ఒకదాని వెంట మరొకటి విస్తరిస్తూ జ్వరాల బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒకరికి జ్వ రం వస్తే ఆ కుటుంబ సభ్యులు మొత్తం జ్వర పీడి తులుగా మారుతున్నారు. ఒకటి రెండు రోజులు జ్వరం వస్తే ప్లేట్లేట్స్ తగ్గిపోతున్నాయి. దీంతో జ్వర పీడితులు ఆందోళన చెంది వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రికి రోజుకు 180-200 వరకు ఓపీ వస్తుందంటే జ్వరాలు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో అర్థమవుతోం ది. పట్టణంలోని అన్ని ప్రయివేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. రాత్రి 10-11 గంటల వరకు కూడా జ్వర పీడితులకు ప్రయివేటు వైద్యులు ఓపికతో వైద్య సేవలు అందిస్తున్నారు. అయినా జ్వరం తగ్గడం లేదు. ప్రభుత్వాస్పత్రి ఆధ్వర్యంలో ఉచి త ఆరోగ్య క్యాంపులు పెట్టి వైద్య సేవలు అంది స్తున్నప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడం మిస్టరీగా ఉంది. జ్వరాల బారిన పడి ఒక కుటుం బం రూ.10 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. జ్వరం తగ్గి నా నీరసం తగ్గక ఏ పనీ చేసుకోలేని పరిస్ధితుల్లో జ్వర పీడితులున్నారు. జ్వరం సోకిన వారందరికీ ప్లేట్లేట్స్ పడిపోవడం సర్వసాధారణంగా మారింది.
వారంలో ముగ్గురు మృతి....
అంబేద్కర్ నగర్లో ఈ వారంరోజుల్లో డెం గ్యూ వ్యాధితో ముగ్గురు మృతి చెందడం విశేషం. అంబేద్కర్ నగర్కు చెందిన మేకల వెంకటేశ్వర్లు, నారుమళ్ళ విమలమ్మ, తోటా లక్ష్మీలు డెంగ్యూతో మృతి చెందగా ఉబ్బెన పుష్పమ్మ జ్వరంతో మృతి చెందింది. అయితే అంబేద్కర్ నగర్లో ప్రతి ఇంటి కి జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. అం బేద్కర్ నగర్లో మురికి కాల్వలు కానీ, చెత్తా చెదా రం లేవు. మొత్తం సీసీ రోడ్లు వేసి పరిశుభ్రంగా ఉన్నప్పటికీ జ్వరాలు అంతుపట్టకుండా ఉన్నాయి. దీంతో పాటు కల్లూరులో ఓరా సుధీర్ కుమారుడు డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. కె.వీరయ్య కూడా డెంగ్యూతోనే మృతి చెందాడు. ఈ విధంగా కల్లూరులో ఇప్పటికీ డెంగ్యూతో ఐదుగురు మృతి చెందారు. ఇవి కాకుండా జ్వరంతో మృతి చెందిన వారు ఉన్నారు. ఈ అంతుపట్టని జ్వరాలకు ఖ మ్మం, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్ళి వైద్యసేవలు చేయించుకుం టున్నప్పటికీ కొంతమంది మృత్యువాత పడుతున్నారు.
పారిశుభ్ర పనులు ముమ్మరం...
అంతుపట్టని జ్వరాలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్య పనులు రెండు నెలలుగా ముమ్మరంగా సాగిస్తున్నారు. సైడు కాల్వలు పూడిక తీయడం, ఇండ్ల వెంట చెత్తను లేకుండా చేయడం, ఖాళీ స్థలాల్లో పొక్లెన్తో చెత్తను తీయ డం, నీటి నిల్వలు లేకుండా చేయడం, గంబూషి యా చేపలు వేయడం, బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి చేపట్టినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవ డంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.