Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూడీఎఫ్ రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకణబద్దులు కావాలని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్ పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా పాటిం చాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మం చికంటి భవన్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావే శం కోదాటి గిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషే ధించడానికి ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం ఒక ఎత్తైతే అసలు ప్లాస్టిక్ తయారు చేస్తున్న కంపెనీలను మూసివేయడం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమన్నారు. టీయూడీఎఫ్ నాయకు డు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధించాలని ఈ నెల 29వ తేదీన ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి సైకిల్ ర్యాలీ నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు మంచం పట్టారని, డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఇంటింటికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రయివేటు ఆస్పత్రుల్లో మెడికల్ టెస్టుల ధరల జాబితాను ఏర్పాటు చేయించాలన్నా రు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, టీయూడీఎఫ్ జిల్లా నాయకులు వై.విక్రమ్, టి.లింగయ్య, శీలం నర్సింహారావు, బండారు రమేష్; బండి పద్మ, మల్లిఖార్జునరావు, బండారు యాకయ్య, కుక్కల గురుమూర్తి, గంటా భీమయ్య, చిరంజీవి, నాగుల్మీరా, ఉమ్మినేని రాంబాబు, పాపారావు, శీలం వీరబాబు, నాగేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.