Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 16న వాంతులు, లోబీపీతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చేరిన సింగరేణి హెడ్ ఓవర్మెన్ పి.దుర్గాప్రసాద్ భార్య పి వీరవసంతరాణి మంగళ వారం మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆమె మృతి చెందిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వంగా వెంకట్ ఆధ్వర్యంలో కార్మికులు ఆ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. ఆమె మృతికి కారణాలు తెలపాలని మృతదేహాన్ని అంబుల ెన్స్లో ఆమె నివాసానికి తరలించకుండ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఆమె గుండెపోటుతో మహిళ మృతి చెంది ఉండవచ్చని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేయటం చూస్తేనే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వల్ప అస్వస్థతో క్యాజువాలిటీలో ఉంచిన వైద్యులు, ఆమె పరిస్థితి బాగానే ఉందని జనరల్ వార్డుకు మార్చిన 24 గంటలకు ఆమె చినిపోయిందని, ఆమె ఆరోగ్య స్థితిని వైద్యులు పర్యవేక్షించకుండా, పర్యవేక్షిం చాల్సిందిగా సిబ్బందికి సూచించటం వల్ల వారికి ఆమె ఆరోగ్య సమస్య తెలియక పోవటం వల్ల చికిత్స అందించలేక పోయారని, దీంతో ఆమె మృతి చెందిందని వారు ఆరోపించారు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని అంబులెన్స్లో ఆమె నివాసానికి తరలిం చారు. ధర్నా చేసిన వారిలో శేషగిరిరావు, సురేష్, హనుమంతరావు, నర్సింగరావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.