Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
మహిళపై అత్యాచారయత్నం, హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ కొత్తగూడెం ఐదవ అదనపు సెషన్స్ జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ మంగళవారం తీర్పుచెప్పారు. చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీకి చెందిన రాచపల్లి శ్యాం తన తండ్రి మరణ అనంతరం తన తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక రుద్రంపూర్ ఎర్రగడ్డ ఏరియాకు చెందిన మందుల లింకన్ వద్ద రూ.15వేలు అప్పు చేశాడు. అప్పు వసూళ్లు చేసుకునే పేరుతో లింకన్ దన్బాద్లోని శ్యాం ఇంటికి తరుచూ వస్తుండేవాడు. 2013 నవంబర్ 16న రాత్రి 9గంట లకు దన్బాద్కు వచ్చి తన అప్పుతీర్చాలని లేకపోతే తన కోరిక తీర్చమని ఆ మహిళను అడిగేవాడు. వ్యతిరేకించిన ఆమెపై లింకన్ కిరోసిన్పోసి నిప్పు అంటించాడు. ఆమె కేకలు విన్న స్తానికులు ఆమెను ఆస్పత్రికి తరలి ంచారు. కొత్తగూడెం టూటౌన్లో రాచపల్లి శ్యాం ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ కే.సత్యనారాయణ కేసునమోదు చేశారు. 2013 డిసెంబర్ 7న ప్రభుత్వాసత్రిలో శ్యాం తల్లి మృతి చెందింది. సీఐ వెంకటస్వామి కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్దాఖలుచేశారు. కోర్టులో 17 మంది సాక్షుల విచారణ అనంతరం మందుల లింకన్కు జీవిత ఖైదు, రూ.5వేలు జరిమాన, సెక్షన్ 354 ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమాన విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పురుషో త్తంరావు ప్రాసి క్యూషన్ నిర్వహించగా, కోర్టు పీసీ జర్పుల రవి, లైజన్ ఆఫీసర్లు ఎన్.వీరబాబు, హరిగోపాల్, ఎం.వెంకటేశ్వరరావు సహాకరించారు.