Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కురుగుంట్ల సుగుణమ్మకు చెందిన మొక్కజొన్న పంటను ద్వంసం చేసిన విషయంలో ఇద్దరు వ్యక్తులపై కేస నమోదు చేసినట్టు ఎస్సై రెడ్డిబోయిన ఉమ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సుగుణమ్మకు మండల పరిధిలోని పందిళ్లపల్లి రెవెన్యూ గ్రామంలో 65 సర్వే నెంబర్లో గల ఐదెకరాల వ్యవసాయభూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట చేతి కొచ్చే దశలో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కురుగుంట్ల చిన్న సైదా రడ్డి, అతని కుమారులు నరసింహ రడ్డిలు కలసి ఈ నెల 10న పంటను ధ్వంసం చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.