Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో అడవి పందిమాంసం విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళ వారం ఆటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏరువ వెంకటేశ్వరరెడ్డి, గోలిశ్రీను అనే ఇద్దరు వ్యక్తులు మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి కొంత మాంసం స్వాధీనం చేసుకొని ఆశ్వాపురం ఈటవీ శాఖ కార్యాల యానికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో అధికారి అలివేలు మంగ పాల్గొన్నారు.