Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ ఇన్ఫోటెక్లో 11 మంది విద్యార్థుల ఎంపిక
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
నూతన ఆవిష్కరణలకు ఆధారమైన మూలాలను ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ వెళ్ళడం వల్లనే సాప్ట్ వేర్ రంగంలో త్వరగా అభివృద్ధి కలుగు తున్నామని ఐబీఎం టెక్నికల్ హెడ్ వి. నాగ శ్రీనివాసరావు అన్నారు. గత రెండు రోజులుగా ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీఎన్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణం నియా మకాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి నాగ శ్రీనివాస్ మాట్లాడారు. ఉద్యోగాలు సాధించిన 11 మంది విద్యార్థులను అభినందించారు. డేటాసైన్స్ ఇప్పటి కంప్యూటర్ రంగాన్ని శాసిస్తోందని ఎంత త్వరగా దానిపై పట్టు సాధిస్తే అన్ని అవకాశాలు మనముందుకు వస్తాయని ఆవైపుగా తమ కళాశాలలో నైపుణ్యాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కళాశాల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల పరిజ్ఞానంతో పాటు చదువులో రాణిస్తే మరింత అవకాశాలను అందుకోగలరని అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య జే.లక్ష్మీనారాయణ, బీఎన్ ఇన్ఫోటెక్ డీ ఈఓ రాజేష్, శృతి, లక్ష్మీ, సృజన్, రాజేష్, రామ్ మోహన్, శిరీష పాల్గొనగా ఉద్యోగాలు సాధించిన 11 మంది విద్యార్థులను అభినందించారు.