Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కారేపల్లి, కామేపల్లి మండలాల స్థాయి క్రికెట్ పోటీల్లో పోలంపల్లి టీమ్ విజయం సాధించింది. ఈసందర్భంగా విజేతలకు బహుమతులను కోటమైసమ్మ ఆలయ చైర్మన్ డాక్టర్ పట్టాభి రామారావు, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు పొదిల వెంకన్న, స్రవంతి అందించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమసమాజ నిర్మాణ కోసం పాటుపడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు నిర్వహించటం వలన ఈ ప్రాంత క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఖమ్మం శశి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోత్ బన్సీలాల్, ఎంపీటీసీ మూడు జ్యోతి, సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్, మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.