Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ గ్రామంలోని కల్లుగీత సహకార సంఘంలోని 86 మంది కల్లుగీత కార్మికులకు గ్రామంలోని గుడిద నరసింహ గౌడ్ విగ్రహం వద్ద మధిర ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు చేతుల మీదగా ప్రభుత్వ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కల్లుగీత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వం సంఘంలోని సభ్యులు అందరికీ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి నూతన కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో అందరూ కలిసి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. లేని పక్షంలో సంఘం గుర్తింపు రద్దవుతుందని, దానివలన ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్లుగీత కార్మికులు చెల్లించవలసిన పన్నులను రద్దుచేయటం వలన గీత కార్మికులకు మేలు జరిగిందన్నారు. గ్రామంలో ఎవరు కూడా పర్మీషన్ లేకుండా తాటి, ఈత చెట్లను నరక కూడదని అలా చేస్తే శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.కల్లుగీత కార్మికులు ఎవరైనా ఈత వనాలను పెంచుకోవడానికి ప్రభు త్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్.ఐ శ్రావణి, గ్రామ ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ్, సొసైటీ మాజీ చైర్మన్ చిన్న నరసింహ, మరీదు రాము, రాము, శ్రీకాంత్, శివ, కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.