Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ కమిటీ నివేదికను సమర్పించేందుకు ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువు పొడిగించడం సరికాదని పీఆర్టీయూ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్ ఆక్షేపించారు. మంగళవారం స్థానిక పాతసెంటర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. ప్రతీ ఐదేండ్లకోసారి ఉద్యోగులకు నూతనంగా వేతన సవరణ కమిటీ ద్వారా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు నిర్ణయిస్తోందన్నారు. వాస్తవానికి 2018 జులై నుంచి ఉద్యోగులకు నూతన వేతన సవరణను ప్రకటించాల్సి ఉండగా ప్రకటించకుండా డిసెంబర్ వరకు గడువు ఇవ్వడం దారుణమన్నారు. ఆలస్యం చేయడం వల్ల అనేక మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తూ మానసిక క్షోభకు గురవుతారన్నారు. ఈ సమావేశంలో వేము రత్నాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.చెన్నకేశవరెడ్డి, నాయకులు మైలమాల అబ్రహం, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.