Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
నల్లనేలలో ఎర్ర సూర్యుడు వినరు కుమార్ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాల విశ్వం కీర్తించారు. స్థానిక కొత్తబస్టాండ్ సెంటర్లో మంగళవారం అంబేద్కర్, కొమరం భీం విగ్రహాల వద్ద ఇల్లందు మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఏదులాపురం వినరుకుమార్ యాదిలో ముద్రించిన పీడిత ప్రజల పక్షపాతి వ్యాససంకలనం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. ఆదిపత్య కులాల కుట్రలను తిప్పి కొడుతూ సకల కులాలను ఐక్యం చేస్తు సామాజిక న్యాయం కోసం కృషి చేశారని అన్నారు. కార్మిక, కర్షక రాజ్యం కోసం కడ వరకు కలిసి నడిచిన ఉత్తమ కమ్యూనిస్టని అన్నారు. ఇల్లందు ప్రాంతానికి నీతి, నిజాయితీగా పనులు చేశారని అన్నారు. మున్సిపల్ చరిత్రలో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రంట్ జిల్లా అధ్యక్షులు మంతెన సంజీవరావు, టిజెఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి, తుడుం దెబ్బ డివిజన్ కార్యదర్శి దుగ్గారపు వీరభద్రం, టివివి నాయకులు రమేష్ బాబు, రామచంద్రు, సురేందర్బాబు, మంతెన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.