Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
క్షయవ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు పాటించాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు, అన్నారు. మంగళవారం క్షయవ్యాధి క్యాంపు ను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎంపీపీ ముక్తిసత్యం, సర్పంచ్ కోరం సీతా రాములు మండల వైద్యాధికారి డాక్టర్ రవిచంద్, ఆళ్ళపల్లి వైద్యాధికారి సంధ్యారాణి మాట్లాడుతూ క్షయవ్యాధి గురించి వివరిం చారు. రెండువారాలకు పైగా దగ్గు ఉండి క్రమంగా బరువు తగ్గుతున్నట్లు అనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన నాటి ఆరునెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయవ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. క్షయవ్యాది óగ్రస్తులు మందులు వాడుతున్నంత కాలం రోగికి రూ.500 అందించబడతాయని తెలిపారు. ఆక్టివ్ కేస్ పైండింగ్, సిబిచాట్, ఎక్స్రే మిషన్లతో పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానాల ఉపెందర్, సీహెచ్ ఓ శ్రీహరి, టీబీ సూపర్ వైజర్ సుధాకర్, వైద్య బృందం సోమయ్య, శర్వాన్, శంకర్, ఏఎన్ఎంలు ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.