Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఎల్.నీరజ రఘు
నవతెలంగాణ-కల్లూరు
మేజర్ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేదానికి ప్రజలు సహకరించాలని మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్కినేని నీరజ రఘు కోరారు. మంగళ వారం పంచాయతీ కార్యాల యంలో వార్డు సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సూచనల మేరకు పారిశుధ్య నిర్మూలన పనులు వేగవంతం చేయా లన్నారు. గ్రామంలో డ్రయినేజీలు శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టను న్నట్టు తెలిపారు. పల్లె ప్రగతి చేపట్టిన గ్రామ అభివృద్ధి పనులు విజ యవంతంగా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. శ్మశానవాటిక, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డుల పనులు పూర్తి కావొచ్చాయన్నారు. ప్లాస్టిక్ నిషేదంపై విస్తృత అవగాహన కల్పించనున్నామని, అయినా అమలు చేయని వారికి జరిమానాలు విధించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఈఓ నాగేశ్వరరావు, లక్కినేని రఘు, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు ఎస్కె.ఇస్మాయిల్, మండల కో-ఆప్షన్ సభ్యులు ఎస్కె. కమిలి, వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అఫ్రోజ్ పాల్గొన్నారు.