Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
మండల పరిధిలోని లంకా సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారామ్ ఆధ్వర్యంలో మంగళవారం పలు వురికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. తొలుత పీహెచ్సీలో వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రసవ సమయం లో ఆస్పత్రికి తరలించేందుకు 102వాహనాలను వినియోగించుకోవాల న్నారు. ఈ విషయమై ఆశా కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ బీ.శాంతారాణి, టీ.సురేష్, స్టాఫ్ నర్స్ స్రవంతి, హెచ్ఎస్ ప్రకాశరావు పాల్గొన్నారు.