Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచరూరల్
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన జిల్లా జట్టు ఎంపికల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు పాయం నితిన్, రేగ హరిప్రసాద్, గొగ్గెల లకీëనరసింహలు ఎంపిక య్యారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకా రులను ఖమ్మం రీజనల్ క్రీడల సమన్వయాధికారి భద్రయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 23, 24, 25న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొననున్నట్లు రీజనల్ క్రీడల సమన్వయాధికారి భద్రయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొడెం కాశయ్య, రాజేశ్వరి, తిరుపతి, రమ్య, కిశోర్, రవి, వెంకన్న, కవిత, జుంకిలాల్, వనిత, దశరథం, నాగార్జున, వినోద్ తదితరులు పాల్గొన్నారు.