Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూములు కోల్పోతున్న రైతులకు నూతన కలెక్టరేట్ భూ సేకరణ ధర ఎకరం కోటి రూపాయల పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో భూములు కోల్పోతున్న రైతులు రాష్ట్ర మంత్రి కె తారక రామారావు (కెటిఆర్) కు ఆన్ లైన్ ద్వారా రైతులు తమ మనోగతాలను పంపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తుగా రైతులతో చర్చలు జరిపి నష్టపరిహారం పై స్పష్టత ఇవ్వాలని అలాకాకుండా బలవంతం గా భూ సేకరణ కోసం సర్వే చేయడం తగదన్నారు. ఖమ్మం జిల్లాలో నూతన కలెక్టరేట్ భూ సేకరణ కోసం చెల్లించిన ధర ఎకరం కోటి రూపాయలు దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తి స్థాయి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తగిన నష్టపరిహారం కోసం ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, రైతు సంఘం నాయకులు వడ్లమూడి మధు, చెరుకుపల్లి పురుషోత్తం, శ్రీనివాస్, పిచ్చయ్య, చింతనిప్పు వెంకటేశ్వరరావు, కొందరిని వెంకటలక్ష్మయ్య, చింత నిప్పు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఆర్డీవో రవీందర్ నాథ్కి వినతి..
గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఖమ్మం నూతన కలెక్టరేట్ భూ సేకరణ ధర దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు రైతులు ఖమ్మం ఆర్డీవో రవీందర్ నాథ్ కి విన్నవించారు.